రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ప్లేయర్ పర్వేజ్ రసూల్ ఆనందం వ్యక్తం చేశాడు. రంజీ ట్రోఫీ గెలవాలన్న తమ దశాబ్దాల కల ఈ రోజు నిజం కాబోతున్నట్లు తెలిపాడు. అలాగే, బౌలర్ అఖిబ్ నబీని పర్వేజ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడు టీమిండియాకు ఎంపిక కావడం ఖాయమని వ్యాఖ్యానించాడు. కాగా, కర్ణాటకతో జరుగుతున్న రంజీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ విజయం లాంఛనమే.