మాల్దీవుల్లో జరిగిన బోటు ప్రమాదంలో భారత మాజీ క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం లగ్జరియస్ స్పీడ్ బోటు తిరగబడటంతో అందులోని ఏడుగురు సముద్రంలో పడిపోయారు. ఈ ఘటనలో అర్జున అవార్డీ, సెయిలర్ మహేశ్ రామచంద్రన్తో పాటు వెటరన్ ర్యాలీ డ్రైవర్ ‘జిప్సీ కింగ్’ హరిసింగ్ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరి మరణంపై పలువురు క్రీడాకారులు సంతాపం తెలియజేశారు.