భారత మహిళల జట్టుకు వన్డే వరల్డ్ కప్-2025 విజయంతో ప్రపంచంలో ఎక్కడైనా ట్రోఫీలు గెలవగలమనే నమ్మకాన్ని ఇచ్చిందని కెప్టెన్ హర్మన్ పేర్కొంది. ఆ విజయం తర్వాత అభిమానులు, మీడియా తదితరుల నుంచి తమకు దక్కిన గుర్తింపే వేరని తెలిపింది. ఈ ఏడాది జరిగే T20 WCలోనూ టైటిల్ కోసం శ్రమిస్తామని చెప్పింది. కాగా ఇంగ్లండ్-వేల్స్ వేదికగా జూన్ 12-జూలై 5 మధ్య మహిళల పొట్టి మెగా టోర్నీ జరగనుంది.