ఐపీఎల్లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు చెరో 9 మ్యాచ్లు ఆడి, నాలుగేసి విజయాలతో 8 పాయింట్లు సాధించాయి. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ విజయం అత్యంత కీలకం.