MIతో మ్యాచ్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన నికోలస్ పూరన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. IPLలో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక (5 సార్లు) అర్ధశతకాలు చేసిన రెండో ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఈ క్రమంలో RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(4 సార్లు)ని వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో 6 సార్లతో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.