ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో 228/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టార్ బ్యాటర్ పూరన్ (63) కేవలం 21 బంతుల్లోనే 8 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, మార్ష్ (44), హిమ్మత్ సింగ్ (40), మార్క్రమ్ (31) రాణించారు. కెప్టెన్ పంత్ (15) మరోసారి విఫలమయ్యాడు. MI బౌలర్లలో కార్బిన్ బోష్ 2 వికెట్లు తీయగా.. ఘజన్ఫర్, జాక్స్, రఘు శర్మ తలో వికెట్ పడగొట్టారు.