IPL 2026లో విరాట్ కోహ్లీని ఔట్ చేయడం తన డ్రీమ్ వికెట్ అని సన్రైజర్స్ యువ పేసర్ సకిబ్ హుసేన్ తెలిపాడు. తన తొలి ఓవర్లోనే కోహ్లీ వికెట్ తీసి సంచలనం సృష్టించిన సకిబ్.. పిచ్ను బట్టి స్లో బంతులు వేయాలన్న కోచ్ వరుణ్ భాయ్ సూచనలతోనే ఈ ప్రణాళిక అమలు చేశానని చెప్పాడు. ప్లేఆఫ్స్కు చేరిన తమ జట్టును విజేతగా నిలిపేందుకు వంద శాతం శ్రమిస్తానని సకిబ్ పేర్కొన్నాడు.