పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని అతడు ఆరోపించాడు. ఆ కారణంతోనే కుల్దీప్ను సూర్య జట్టు నుంచి తొలగించినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా పాక్తో జరిగిన మ్యాచ్లో వారి మధ్య ఉన్న విభేదాలు మైదానంలో బహిరంగంగానే బయటపడ్డాయని షెహజాద్ వ్యాఖ్యానించాడు.