IPL 2026లో ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పిక్క గాయంతో బాధపడుతున్న అతడు చెన్నై జట్టుతో పాటే ఉంటున్నాడు. అయితే, ఇవాళ ఢిల్లీతో మ్యాచ్ కోసం ధోనీ జట్టుతో పాటు వెళ్లలేదు. దీంతో అతడు IPL 2026కు పూర్తిగా దూరమైనట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ధోనీ ప్రస్తుతం తమతో లేడని, జట్టుతో పాటు ఢిల్లీకి రాలేదని CSK బౌలింగ్ సలహాదారు సిమన్స్ వెల్లడించాడు.