హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సతీమణి విమలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పకు మంత్రి ఆదేశించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘రణబాలి’. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ అనంతపురంలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకు ఇక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో విజయ్, రష్మిక పాల్గొంటున్నారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
CTR: ఏప్రిల్ 4 నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కోసం చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయులకు నియమనిబంధనలు తెలియజేస్తామన్నారు. తప్పు చేస్తే పెనాల్టీల మోత మోగుతుందన్నారు. రోజుకి 40 పేపర్లు మాత్రమే కరెక్షన్ చేయడానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు.
PPM: స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ సూచనల మేరకు శనివారం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అదేశాలతో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల, SDPO, సర్కిల్ కార్యాలయాల అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది పాల్గొని వారి స్టేషన్లు/కార్యాలయాలు శుభ్రం చేయడంతో పాటుగా చుట్టుపక్కల పరిసరాలలో వుండే చెత్తా చెదారం, పిచ్చిమొక్కలను, పచ్చికను తొలగించారు.
MDK: మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రకృతి వనం వేసవి తాపానికి కళావిహీనంగా మారుతోంది. గత ఏడాది భారీ వర్షాలతో పచ్చగా కళకళలాడిన వనం, ప్రస్తుతం మార్చి నెలలోనే ఎండలు ముదరడంతో ఆకులు రాలిపోయి ఎండిపోయే దశకు చేరుకుంది. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ వనాన్ని కాపాడుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయి పల్లె గ్రామంలో ఇవాళ ఆదిలక్ష్మి అనే మహిళపై అదే గ్రామానికి చెందిన వీరాంజి నాయక్ అనే వ్యక్తి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరాంజి నాయక్ ఆదిలక్ష్మి ఇంటి వద్ద ఉన్న దిమ్మెలను పడగొట్టాడని ఆమె ఆరోపించారు. అనంతరం ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.
KRNL: దేవనకొండ గ్రామపంచాయతీ పరిధిలోని బండ్లమెట్ట, కామేలా, సంత మార్కెట్ స్థలాలకు ఇవాళ వేలం పాట నిర్వహించనున్నట్లు కార్యదర్శి రాముడు తెలిపారు. ఆసక్తి గలవారు నిర్ణీత డిపాజిట్ చెల్లించి పాల్గొనవచ్చన్నారు. బండ్లమెట్టకు రూ.2.50 లక్షలు, కామేలకు రూ.50 వేల, సంత మార్కెట్కు రూ.1.50 లక్షలు డిపాజిట్గా నిర్ణయించారు. నిబంధనల మేరకు వేలం జరుగుతుందని వెల్లడించారు.
AP: అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా తీర్మానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాధాన్యత, అమరావతి రైతుల త్యాగాలను ఆయన వివరించారు. ఈ తీర్మానంపై సభలోని అందరూ చర్చించి, బలపరచవలసిందిగా సభ్యులను విన్నవించారు.
MLG: రైతు భరోసా డబ్బుల కోసం జరిగిన కుటుంబ గొడవ రక్తపాతానికి దారి తీసింది. ములుగు మండలం చింతలపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి డబ్బుల విషయంలో కుమార్ వాగ్వాదానికి దిగాడు. అడ్డుకున్న సతీశ్, రమేశ్పై కత్తితో దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. గ్రామస్తుల సమాచారం మేరకు 108 ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
SRPT: నాగారం పరిధిలోని ఎస్సారెస్పీ DBM 71 కాలువ ద్వారా సాగునీటి సరఫరా ఉధృతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం గణాంకాల ప్రకారం.. కాలువ ఫ్లూమ్ రీడింగ్ 2.60 మీటర్ల వద్ద ఉండగా, ఏకంగా 1,295 క్యూసెక్కుల భారీ నీటి ప్రవాహం దిగువకు వెళ్తుంది. SRSP జలాలు పుష్కలంగా పారుతుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
HYD: జలమండలి పేరుతో ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని HMWSSB హెచ్చరించింది. ఇలాంటి ట్యాంకర్ల నీరు శుద్ధి చేయబడినది కాకపోవడంతో ఆరోగ్యానికి హానికరం కావచ్చని చెప్పారు. ట్యాంకర్ బుకింగ్ కోసం తప్పనిసరిగా 155313 ద్వారా మాత్రమే సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే ఒక ట్యాంకర్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ASF: పెంచికల్ పేట్ మండలం చెడ్వాయి గ్రామపంచాయతీలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు కార్యక్రమాన్ని పశువైద్యాధికారి రాజేశ్, సర్పంచ్ శ్రీనివాస్ కలిసి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ గేదెలకు టీకాలు వేయించాలని కోరారు.
MNCL: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి 29న మద్యం మత్తులో వైద్యులు, నర్సులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. తిలక్ నగర్కు చెందిన గొట్టే పవన్ తేజ్, సంపత్, జాడి విజ్ఞేష్లు చెకప్ కోసం వచ్చి డాక్టర్ జయప్రకాశ్పై భౌతిక దాడికి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
HYD: మెట్టుగూడ పరిధిలోని తుకారాం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఫుట్పాత్లను సైతం ఆక్రమించిన దుకాణాలు, నిర్మాణాలను గుర్తించి ఎక్కడికక్కడ తొలగించినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారి సౌకర్యం మెరుగుపరిచే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని తీర్మానించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ‘ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలకు ఈ సభ ప్రతీక. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే పవిత్ర యజ్ఞమిది. ఇందులో పాల్గొన్న భాగ్యం మనకు లభించింది’ అని పేర్కొన్నారు.