విజయనగరం: ఐపీఎల్ సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా యువత ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్రావు సూచించారు. బెట్టింగ్ యాప్లో అప్పులపాలు చేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే 100కు ఫోన్ చేయాలని కోరారు.
MNCL: శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ గనిలో హ్యామర్మ్యాన్గా పనిచేస్తూ ప్రమాదంలో శాశ్వత దివ్యాంగుడైన సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ ద్వారా రూ.కోటి బీమా సొమ్ము అందజేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జీఎం ఎం.శ్రీనివాస్, బ్యాంక్ సీజీఎం అపర్ణా రెడ్డి చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు. సూపర్ సాలరీ అకౌంట్ ప్రయోజనాలపై అధికారులు అవగాహన కల్పించారు.
RR: మియాపూర్ సర్కిల్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. నల్లగండ్ల వంతెన పరిసర ప్రాంతాలను క్లీన్ చేయడంతో పాటుగా, మొక్కలకు నీరంధించారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రోగ్రాం ప్రారంభించిన అధికారులు, సైబరాబాద్ కార్పొరేషన్ వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు ఈ డ్రైవ్ కొనసాగనుంది.
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో 2026-27 సంవత్సరానికి గాను తై బజార్, సంత బహిరంగ వేలం ఇవాళ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి సాయన్న తెలిపారు. ఆసక్తి గలవారు తై బజార్ రూ.30 వేలు, సంతకు రూ.50 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. ఇదివరకు వేలంపాట దక్కించుకొని బకాయి ఉన్నవారు, ఇంటి పన్ను లైసెన్స్ ఫీజు బకాయి ఉన్నవారికి అర్హత లేదన్నారు.
Wnp: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు శనివారం గణితం పరీక్షను నిర్వహిస్తున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.
TG: కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుమ్మక్కయ్యారని, రేవంత్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో ప్రజలకు తెలుసని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
NDL: అవుకు కొండల్లోని కంబగిరి స్వామి ఆలయంలో ఈనెల 29 నుంచి ఏప్రిల్ 3 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆలయ ఈవో రామకృష్ణ శుక్రవారం ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాల వివరాలు వివరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.
NLR: కోవూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని అరకు ఎంపీ తనూజా రాణిని శనివారం వైసీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోరారు. ఆమె సానుకూలంగా స్పందించి రూ. 10 లక్షల నిధులు కేటాయించారు. దీనిపై ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు. కొడవలూరులో ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.
PLD: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేట మండలం వేలూరులో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. DSP హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలతో పాటు, అనధికారికంగా ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు DSP తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామన్నారు.
HYDలో ఏప్రిల్ 2న వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించనున్నట్లు బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ యాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై, కోఠి ఆంధ్ర బ్యాంకు కూడలి వరకు చేరుకుని, అనంతరం సికింద్రాబాద్ థర్డ్ బండ్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశముందని పేర్కొన్నారు.
ప్రకాశం: దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామంలో శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవం నేడు జరగనున్నది. తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుణాల సందర్భంగా మూడు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేస్తన్నారు.
MDCL: ఈనెల 30న HYDలో లేబర్ కమిషన్ కార్యాలయం ముట్టడికి రంగం సిద్ధమైంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేడ్చల్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముట్టడికి కార్మికులంతా భారీగా రావాలన్నారు.
MDCL: ఈనెల 30న HYDలో లేబర్ కమిషన్ కార్యాలయం ముట్టడికి రంగం సిద్ధమైంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేడ్చల్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముట్టడికి కార్మికులంతా భారీగా రావాలన్నారు.
PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో ఇవాళ మండల పశు వైద్యాధికారి డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. రైతులు పశు పోషణలో తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్పాల్, పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి పన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మొండి బకాయిదారుల వివరాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాలని సూచించారు.