PDPL: ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గడ్డం లింగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈదుల ప్రదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బోట్ల లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శిగా ఆకారి రాజేశం, కోశాధికారిగా నూనె సత్యనారాయణ, సాంస్కృతిక కార్యదర్శిగా భీమారపు సంపత్ ఎన్నికయ్యారు.
అన్నమయ్య: మదనపల్లెలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను పోలీసులు వేరు చేశారని యువకుడు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేశాడు. ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన వినోద్ కుమార్, కొత్తకోట మండలానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అయితే బి.కొత్తకోట సీఐ గోపాలరెడ్డి తమను విడదీసి యువతిని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించాడని ఆరోపించారు.
బాపట్లలో గురువారం అర్ధరాత్రి రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద AMVI కిషోర్ బాబు బస్సుల రికార్డులు చెక్ చేశారు. ఎమర్జెన్సీ విండోలు సరిగా పనిచేస్తున్నాయా అని పరిశీలించి, ప్రమాదాల నివారణ చర్యలపై డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు.
GNTR: శ్రీరామ నవమి పండుగ రోజున ఇవాళ నగరంలోని అన్ని విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు చెల్లించే ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీహెచ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి బిల్లులు చెల్లించవచ్చన్నారు.
ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ. 10 వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని PDSU జిల్లా సహాయ కార్యదర్శి కనకే దత్తాత్రి కోరారు. గురువారం పట్టణంలో సంఘం నాయకులతో సమావేశమై మాట్లాడారు. నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలలో చదివి విద్యార్థులు సర్టిఫికెట్లు అందక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
MBNR: శ్రీరామనవమిని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కళాశాల మైదానంలో “వానర” ఆధ్యాత్మిక సంస్థ వారి ఆధ్వర్యంలో భజన్ మ్యూజిక్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. యువతలో దేశభక్తి, దైవభక్తి, దైవం పై మనసు లగ్నం, చెడు వ్యసనాలను దూరం చేయడం అన్న కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
PPM: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి ఒక్కరోజు జైలు శిక్ష పడిందని సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు గురువారం తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వాహన తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తిని సాలూరు కోర్టులో హాజరుపరచామన్నారు. సదరు వ్యక్తికి ఒక్క రోజు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారని వెల్లడించారు.
ATP: తాడిపత్రికి పర్యాటక పరంగా మహర్దశ పట్టనుందని మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రూ. 250 కోట్లతో రూపొందించిన పర్యాటక అభివృద్ధి ప్రాథమిక నివేదికను చింతల వెంకటరమణ స్వామి పాదాల చెంత ఉంచి గురువారం పూజలు నిర్వహించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి, వెంకటరమణ స్వామి ఆలయాలను ప్రధాన ఆకర్షణగా అభివృద్ధి చేస్తామన్నారు.
MULG: జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది బాలుగు చంద్రయ్య గురువారం ఎన్నికయ్యారు. కోశాధికారిగా బానోత్ స్వామిదాసు వరుసగా మూడోసారి విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా రవీందర్, ఉపాధ్యక్షుడిగా భిక్షపతి, జాయింట్ సెక్రటరీలుగా రాజ్ కుమార్, నవత, సభ్యులుగా సూర్యం, మన్సూర్, అరుణ్ ఎన్నికయ్యారు.
ASR: ఆదివాసీ మహిళ లక్ష్మమ్మ (లక్ష్మి) ఆంధ్ర యూనివర్సిటీలో అరకు కాఫీపై PHD చేసి, డాక్టరేట్ సాధించారు. జీ.మాడుగుల మండలంలోని గడుతూరు పంచాయతీ చిన్నపిన్నపాలెం గ్రామానికి చెందిన లక్ష్మి తండ్రి చనిపోయినా, తల్లి ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈ సందర్భంగా ఆమెను గురువారం ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు అభినందించారు.
MNCL: బెల్లంపల్లి కోదండ రామాలయ ఉత్సవ కమిటీని MLA వినోద్ ప్రకటించారు. ఆలయ ఛైర్మన్గా బండి రాము, డైరెక్టర్లుగా పరమేష్, విజయలక్ష్మి, వెంకటేష్, కృష్ణ, గోవర్ధన్ రావు, శ్రీనివాస్, కుమారస్వామి నియమితులయ్యారు. వారికి MLA వినోద్ నియామక పత్రాలు అందజేశారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి, ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
జగిత్యాలలోని సఖీ (వన్ స్టాప్ సెంటర్)లో పారాలీగల్, లీగల్ కౌన్సిలర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ (LLB), 2 – 3 ఏళ్ల అనుభవం కలిగిన జిల్లా మహిళలు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 25,000 వేతనం చెల్లించనున్నారు. దరఖాస్తులు మార్చి 27 నుంచి 29 వరకు సాయంత్రం 5 గంటలలోపు స్వీకరిస్తారు.
KDP: పులివెందుల శిల్పారామంలో శ్రీరామనవమి పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పరిపాలన అధికారి విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఇవాళ సాయంత్రం SK ఫిలిం స్టూడియో, పులివెందులకు చెందిన మాస్టర్ శ్రీ శర్వాన్ కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులచే శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
PLD: శ్రీరాముల నవమిపండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. జిల్లాలోని ప్రధాన రామాలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. శోభయాత్రలు, కళ్యాణ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మత సామరస్యంతో, సోదరభావంతో జరుపుకుని ప్రజలను కోరారు.
TG: రాష్ట్రప్రజలకు CM రేవంత్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ధర్మం, న్యాయం, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన ఆదర్శపురుషుడని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ధర్మస్వరూపుడు చూపిన మార్గంలో నడుస్తూ జీవితాల్లో సత్యం, సహనం, కర్తవ్యబద్ధతను అలవర్చుకుని ఆదర్శంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఆయన కృపాకటాక్షాలతో అందరి జీవితాల్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు నిండాలని ఆకాంక్షించారు.