TPT: గుడిపాల మండలం చీలాపల్లి గ్రామపంచాయతీ రాసనపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పీటర్ ఆధ్వర్యంలో రాసనపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సునీల్, రూబన్, శ్రీధర్, బాబు, మరో 20 మంది యువకులు చేరారు.
TG: బీజేపీ, ప్రధానిపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతుందని.. రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం నుంచి రూ. లక్ష కోట్లు కక్కిస్తామని 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రచారం చేయలేదా? అని ప్రశ్నించారు.
BDK: రైతాంగ సమస్యలపై ఈనెల 12వ తేదీన గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని CPI(M-L) న్యూడెమోక్రసీ ఇల్లందు నాయకులు శనివారం పిలుపునిచ్చారు. తుఫాన్ కారణంగా పంట నష్టం తీవ్రంగా జరిగిందని రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అనే రకాల పంటలను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సీసీఐ కేంద్రాలు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
HNK: వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ ఫాతిమా నగర్కు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మ, కోలాటాలతో వారికి స్వాగతం పలికారు. ఈ సదర్వంగా కవిత స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయం వైపే జాగృతి ఉంటుంది అని, ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం అని అన్నారు.
PLD: ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసపోతే నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ హనుమంతరావు ఇవాళ కోరారు. చిలకలూరిపేటకు చెందిన సుభాని, వెంకటేశ్వరరావు కుటుంబాల నుంచి ఇటీవల మోసగాళ్ళు ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మోసానికి పాల్పడిన బత్తుల గణేష్, కుమారస్వామిలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలం పద్మాపురం బీసీ కాలనీలో మంచినీటి సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు గురవుతున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డికి తెలియడంతో ఆయన స్పందించారు. బీసీ కాలనీకి మంచినీటి పైపులైను నిర్మాణ పనులకు రూ.8 లక్షలు మంజూరు చేయించారు. గ్రామంలో శనివారం పైపులైన్ పనులను ప్రారంభించారు దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
NLR: DRC మీటింగ్లో రైతుల సమస్యలపై కోవూరు MLA వేమిరెడ్డి మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో చాలామంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద నిధులు జమ కాలేదని తెలిపారు. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా డబ్బులు పడటం లేదని త్వరతగతిన పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ.. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు.
TG: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 2 వేల నాటుకోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి వెంట పొలాల్లో వీటిని విడిచిపెట్టారు. దీంతో నాటు కోళ్లను తెచ్చుకోవడం కోసం జనం ఎగబడ్డారు. అందినకాడికి దొరకబట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే, ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో తెలియాల్సి ఉంది.
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాపై T20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్గా రికార్డ్ సృష్టించాడు. ఆసీస్తో 4వ టీ20లో ఓ వికెట్ తీయడం ద్వారా బుమ్రా ఈ ఫీట్ సాధించి.. పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(19)ని అధిగమించాడు. ఈ లిస్టులో మహ్మద్ అమీర్(17-PAK), మిచెల్ శాంట్నర్(17-NZ) మూడో స్థానంలో ఉన్నారు.
రాష్ట్రీయ జనతా దళ్ (RJD), మహాగఠ్బంధన్పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బీహార్ యువత చేతికి మేం ల్యాప్టాప్లు ఇవ్వాలని చూస్తే, వాళ్లు (ఆర్జేడీ) రివాల్వర్లు (తుపాకులు) ఇస్తున్నారు’ అని మండిపడ్డారు. బీహార్ మళ్లీ ‘జంగిల్ రాజ్’లోకి వెళ్లకూడదని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రభుత్వం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
భోజనం చేసిన వెంటనే షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. దీన్ని నియంత్రించడానికి డాక్టర్లు సూచించే సహజ పద్ధతి చిన్నపాటి నడక. తిన్న వెంటనే అరగంట తర్వాత 10 నుంచి 15 నిమిషాలు మెల్లగా నడిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. నడక ద్వారా కండరాలు శక్తి కోసం గ్లూకోజ్ను వినియోగిస్తాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిల వేగంగా పడిపోతాయి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
NRPT: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మరికల్ మండల కేంద్రంలోని ఆది ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మణుగూరు మండలం నుంచి బీటిీపీఎస్ వరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులను మణుగూరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేపడతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
NRML: హైదరాబాద్లోని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పలువురు మండల నేతలు పాల్గొన్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా డైరెక్టర్ జైన్స్ నాని తెరకెక్కించిన చిత్రం K-ర్యాంప్. దీపావళికి విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి K-ర్యాంప్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ప్రకటించింది. కాగా రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.26 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.