AP: రాష్ట్రంలో 7 మల్టీ విలేజ్ తాగునీటి పథకాలకు ప్రభుత్వం రూ.9,335 కోట్లు మంజూరు చేసింది. కాకినాడ, అనకాపల్లి(D)లకు ఏలేరు రిజర్వాయర్ నుంచి, చిత్తూరు(D)కు గండికోట, శ్రీకాకుళం(D) టెక్కలి, నరసన్నపేటకు హిరమండలం నుంచి నీటిని అందించనుంది. అనంతపురం(D) ఉరవకొండ, రాయదుర్గంకు PABR, కర్నూలు(D) బనగానపల్లికి ఓక్ రిజర్వాయర్, తూ.గో(D) కడియంకు ధవళేశ్వరం నుంచి నీటిని అందించే పనులు చేయనుంది.
VKB: తాండూరు కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష నియమకంపై ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీ సీనియర్ నేత లింగదల్లి రవికుమార్ అధ్యక్ష పదవి కోరుకుంటున్నట్లు సమాచారం. మరి అదే పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ జుబెర్ లాలా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
MNCL: అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందరూ సహకరించాలని జన్నారం అటవీశాఖ ఎఫ్డీవో రామ్మోహన్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో అడవిలో అక్కడక్కడ అగ్ని ప్రమాదాల సంఘటనల సమాచారం అందగానే సిబ్బందిని పంపి మంటలను ఆర్పి వేస్తున్నామన్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు కూడా పంట, తదితర వ్యర్ధాలను అడవి సమీపంలో కాల్చవద్దన్నారు.
సత్యసాయి: హిందూపురం అహమ్మద్ కాలనీలో ఇవాళ ఉదయం పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో డీఎస్పీ మహేష్ నేతృత్వంలో డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా ఈ మెగా కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేసి, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
E.G: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాజమండ్రి, గోకవరం డిపోలలో నిర్బంధిత 38 వాహనాలకు ఈనెల 30న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా రవాణాశాఖాధికారి ఆర్.సురేష్ ఇవాళ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సీజర్ యార్డ్లో వేలం పాట జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనేవారు ముందస్తుగా వాహనాలను పరిశీలించుకోవచ్చన్నారు.
KMM: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ‘ఇసుక వాహనం’ యాప్ను ప్రవేశపెట్టిందని తహసీల్దార్ ఉషాశారద తెలిపారు. గురువారం ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ నుంచి యాప్ ద్వారానే ఇసుక కూపన్లు జారీ చేస్తామని, ఇకపై బ్యాంకుల్లో డీడీలు తీయాల్సిన అవసరం లేదని సూచించారు.
ATP: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఆరోగ్యశాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, అబార్షన్ మందులు అమ్మే మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Vsp: వేగవంతమైన నగరీకరణ వల్ల వేడి తరంగాలు, భారీ వర్షాలు, నగర వరదలు వంటి వాతావరణ ముప్పులు పెరుగుతున్నాయని ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ ఏఎన్వీ సత్యనారాయణ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నగర ఉష్ణద్వీప ప్రభావం, అనియంత్రిత విస్తరణ వల్ల ప్రజారోగ్యం, మౌలిక వసతులు దెబ్బతింటున్నాయని చెప్పారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో జరుగుతున్న సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం కోసం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడకు చేరుకున్నారు. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
PDPL: ధర్మారం మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు కుట్టు శిక్షణ ప్రారంభించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఆధ్వర్యంలో వీరికి 4 రోజులపాటు స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది సత్యనారాయణ, స్వామి, న్యాక్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
JGL: 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వెల్గటూర్ మండలం కోటిలింగాల దేవస్థానం వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు పరిశీలించారు. దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ట్ మాధవి దేవాలయాన్ని సందర్శించి ఘాట్ల పరిస్థితిని పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన పనులపై సూచనలు ఇచ్చారు. అసిస్టెంట్ ఇంజినీర్ సంతోశ్, ఈవో ఉన్నారు.
NZB: TU పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్య అభ్యసిస్తున్న 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించడానికి మరో ఐదు రోజులే గడువు ఉన్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 30 లోపు ఎటువంటి అపరాధ రుసుంలేకుండా చెల్లించవచ్చన్నారు. పూర్తివివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
BHNG: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రలో శ్రీరామనవమి వేడుకలను డప్పు చప్పులతో, మహిళల కోలాట ఆటపాటలతో, డీజే సౌండ్లతో ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి సీతారాముల ఊరేగింపును మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ముఖ్య నాయకులు, పట్టణ పెద్దలు, యువకులుతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
Vsp: ఏయూ వసుదైక కుటుంబ భావనకు ప్రతీకగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఇక్కడ చదవడం ఏయూ అంతర్జాతీయ ఖ్యాతికి నిదర్శనమని చెప్పారు.
JN: బచ్చన్నపేట ప్రయాణికులకు జనగామ డిపో మేనేజర్ స్వాతి గుడ్ న్యూస్ తెలిపారు. బచ్చన్నపేట నుంచి జగద్గిరిగుట్ట వరకు ప్రతిరోజు 2 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తున్నాయన్నారు. ఈ సర్వీసులు పోచన్నపేట, కొలనుపాక, ఆలేరు, భువనగిరి, JBS మీదుగా ప్రయాణిస్తాయని చెప్పారు. ఉదయం 7:20, 7:50 గం.కు, మధ్యాహ్నం 2:35, 3:05 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.