JN: బచ్చన్నపేట ప్రయాణికులకు జనగామ డిపో మేనేజర్ స్వాతి గుడ్ న్యూస్ తెలిపారు. బచ్చన్నపేట నుంచి జగద్గిరిగుట్ట వరకు ప్రతిరోజు 2 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తున్నాయన్నారు. ఈ సర్వీసులు పోచన్నపేట, కొలనుపాక, ఆలేరు, భువనగిరి, JBS మీదుగా ప్రయాణిస్తాయని చెప్పారు. ఉదయం 7:20, 7:50 గం.కు, మధ్యాహ్నం 2:35, 3:05 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.