ATP: అనంతపురం ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ అనుమతులు పునరుద్ధరించడంపై మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి హర్షం వ్యక్తం చేశారు. ఈ శుభ పరిణామం సందర్భంగా అనంతపురంలో సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, విషా ఫెర్రర్లను ఆత్మీయంగా కలిసి ఘనంగా సత్కరించారు. సంస్థ సేవలకు ఆటంకాలు తొలగిపోవడం జిల్లా ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.
HYD: భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి సికింద్రాబాద్కు చెందిన నేతన్న ఎస్. ఎస్. జయరాజ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ పరంపరగా కొనసాగుతున్న ఈ సేవలో భాగంగా భద్రాచలం ఆలయ ప్రాంగణంలోనే మగ్గం ఏర్పాటు చేసి, 12 రోజుల్లో ఆరుగురు చేనేత కార్మికులు షిఫ్టుల వారీగా పని చేశారు. రోజుకు 20 గంటలు పనిచేస్తూ స్వామివార్ల వస్త్రాలు వేశారు.
VKB: బొంరాస్పేటలోని భక్త సమాజం ఆవరణలో ఇవాళ ఉదయం 10 గంటలకు శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు పురోహితుడు జోషి సత్యనారాయణరావు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తీర్థ ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు సీతారాముల ఊరేగింపు ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
కొందరు ప్రతి ఉదయం గుడ్లను తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది ఎంతో మంచి ఆహారపు అలవాటు అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్తో నిండిన గుడ్లను ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. జీవక్రియ, రోగనిరోధక శక్తి, మెడదు పనితీరుకు మేలు చేస్తుందట. అయితే ఉదయం వేళ 2 గుడ్లకు మించి తీసుకోవద్దని సూచిస్తున్నారు.
ATP: గార్లదిన్నె మండలంలోని పాత కల్లూరులో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఇసుక మూట బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్త్స్నుట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. 120 కిలోల ఇసుక మూట ఎత్తుకొని పది నిమిషాల సమయంలో ఎవరైతే ఎక్కువ దూరం వెళ్తారో వారిని విజేతలుగా నిర్ణయిస్తామన్నారు. వరుస బహుమతలుగా రూ.5 వేలు, రూ.4వేలు, రూ.3 వేలు అందిస్తామన్నారు.
BDK: సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు ముందు ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాములవారి కళ్యాణం ప్రజలందరి ఉత్సవమని ఇలాంటి సమయంలో ఆదివాసీ నాయకులను నిర్బంధించడం సరికాదని మండిపడ్డారు. మణుగూరు పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.
MNCL: హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు తాండూర్ CI దేవయ్య తెలిపారు. బెల్లంపల్లికి చెందిన భరత్ మార్చి 23న రెబ్బెనలోని తాత ఇంటికి వెళ్ళాడు. స్నేహితులైన పవన్ కళ్యాణ్, రాజు, వంశీ కలిసి మద్యం సేవిస్తుండగా గొడవ పడ్డారు. అక్కడికి వచ్చిన కిరణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో భరత్ను పొడవగా గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.
కడప: జిల్లాలో PNG ఉన్న ప్రాంతాల్లో LPGకి బదులుగా PNGకి బదిలీ కావాలని జిల్లా కలెక్టర్ చెరికూరి శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఎల్పీజీకి ప్రత్యమ్నయంగా పైపుడ్ నేచురల్ గ్యాస్ వినియోగించేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
AP: కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం హుండీని లెక్కించారు. 30 రోజులకు గానూ నగదు రూపంలో రూ.1,90,12,047 ఆదాయం వచ్చినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. నగదుతో పాటు 87 గ్రాముల బంగారం, కిలో 100 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు. వీటితో పాటు గోసంరక్షణ హుండీ ద్వారా రూ.18,926, నిత్య అన్నదానం హుండీ రూ.1,79,966 ఆదాయం సమకూరింది. అలాగే విదేశీ కరెన్సీ వచ్చినట్లు పేర్కొన్నారు.
SKLM: పలాసలోని కొంతమంది వ్యక్తులకు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన నిందితులకు జైలు శిక్ష విధిస్తూ పలాస జూనియర్ సివిల్ జడ్జి మాధురి తీర్పు వెల్లడించినట్లు సీఐ వై. రామకృష్ణ గురువారం తెలిపారు. విశాఖపట్నంకి చెందిన 4గురు నిందితులకు 16 నెలల జైలు శిక్ష, రూ.4,500ల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. ఉద్యోగాలు ఇస్తామంటూ ఎవరు చెప్పినా నమ్మద్దని పేర్కొన్నారు.
TG: భూభారతి పోర్టల్ను ఏప్రిల్ 2 నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూపరిపాలన సేవలను మరింత వేగంగా అందించేందుకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చామన్నారు. ప్రతి భూ లావాదేవీ వివరాలు అందరికీ కనిపించేలా పోర్టల్ను రూపొందించామని పేర్కొన్నారు.
TPT: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరుగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి కృష్ణ తేజ అతిథి భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. గురువారం 65,600 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,292 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లుగా నమోదైంది.
ప్రకాశం: కంభం మండలం రావిపాడు గ్రామంలో మట్టి పరీక్షల ఉపయోగాలు, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులపై మండల వ్యవసాయ అధికారి దేవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపూరం ఏడీఏ బాలాజీ నాయక్ పాల్గొని మట్టి పరీక్షల ఉపయోగాలు, సమగ్ర పోషక యజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) 323 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అథ్లెటిక్స్, షూటింగ్, స్మిమ్మింగ్, రోయింగ్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గలవారు వచ్చే నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.35,400-1,12,400 మధ్య ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.2500. SC/ST/మహిళలకు రూ.2000.
VKB: తాండూరు నాపరాతి వినియోగానికి ప్రాధాన్యత కల్పించేందుకు ప్రత్యేక GOను ప్రవేశ పెట్టాలని MLA మనోహర్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో కోరారు. నాపరాతికి ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. షాబాద్ స్టోన్గా పేరుగాంచిన నాపరాతిని అందరు వినియోగిస్తున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం టైల్స్, ఇతర పద్ధతులు అమల్లోకి రావడంతో షాబాద్ స్టోన్ వాడకం తగ్గిందని అన్నారు.