• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా ప్రతాపరుద్ర దేవుడి జయంతి వేడుకలు

HNK: వేయిస్తంభాల దేవాలయ ప్రాంగణంలో కాకతీయ సామ్రాజ్య మహారాజు ప్రతాపరుద్ర దేవుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై మాట్లాడారు. ఎంతో ఘనకీర్తి పొందిన ప్రతాపరుద్రుడి చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి రానున్న తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

March 25, 2026 / 08:14 PM IST

వదంతులు నమ్మొద్దు: కిషన్ రెడ్డి

TG: దేశంలో డీజిల్, పెట్రోల్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్పీజీ సరఫరాపై కూడా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వదంతులు నమ్మొద్దని సూచించారు.

March 25, 2026 / 08:14 PM IST

కూతురిని విక్రయించిన తండ్రి

TG: కన్న కూతురిని ఓ కసాయి తండ్రి అక్రమంగా విక్రయించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. అడిశర్లపల్లి మండలం పెద్దగట్టులో బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి బిడ్డ.. తండ్రి మధు సంరక్షణలోనే ఉంది. ఈ క్రమంలో డబ్బులకు ఆశపడి కూతురిని అమ్మేశాడు. పసికందు కనిపించట్లేదని అమ్మమ్మ, తాతయ్యలు ఆరా తీయగా.. అసలు విషయం బయటకువచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 25, 2026 / 08:14 PM IST

‘మట్టి అక్రమ తరలింపు పై చర్యలు చేపట్టాలి’

BHPL: గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో నవాబుపేట శివారులో గుట్టల మట్టిని అక్రమంగా తరలిస్తున్న శేషారెడ్డి సత్య రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేశ్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టుతూ.. సహజ వనరుల దోపిడీ ఆపకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామ్, రామచందర్ మాదిగ పాల్గొన్నారు.

March 25, 2026 / 08:14 PM IST

భద్రాచలంకు ప్రత్యేక బస్సులు

ELR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దర్శనానికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఆర్టీసీ విజయవాడ జోన్ 2 ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఏలూరు డిపో నుంచి 20 బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 14 బస్సులు, నూజివీడు నుంచి 6 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

March 25, 2026 / 08:13 PM IST

ఆదిలాబాద్ మహిళా మార్ట్ ప్రారంభించిన కలెక్టర్

ADB: ఆదిలాబాద్ పట్టణంలో మహిళా సమాఖ్య, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘మహిళా మార్ట్’ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మార్ట్‌ను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దీన్ని ఏర్పాటు చేశామన్నారు.

March 25, 2026 / 08:13 PM IST

కేంద్ర మంత్రితో వేమిరెడ్డి దంపతుల భేటీ

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బుధవారం కలిశారు. పెన్నా నది కరకట్టల బలోపేతం, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేశారు. 2011లో వచ్చిన వరదలు దాటికి ప్రజలు పడ్డ ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

March 25, 2026 / 08:13 PM IST

‘జీడీపీ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి’

SKLM: జిల్లాలో 3వ త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో GDP లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. జిల్లా అభివృద్ధి వేగవంతం కావాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం పథకాలకు బ్యాంకులు సమయానికి రుణాలు మంజూరు చేయాలన్నారు.

March 25, 2026 / 08:12 PM IST

బాలికల రక్తహీనతపై ప్రత్యేక దృష్టి

ASR: బాలికల రక్తహీనతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని జిల్లా వైద్య నిపుణులు గ్రేష్టు, కిషోర్‌కుమార్ తెలిపారు. డుంబ్రిగూడ కేజీబీవీలో బుధవారం 40 మంది విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర బాల్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. పాఠశాలలతో పాటు గ్రామాల్లో 15 ఏళ్ల బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామన్నారు.

March 25, 2026 / 08:12 PM IST

కాలువలు పూర్తి చేయాలి: సీపీఎం

ప్రకాశం: పామూరు మండలం దోబగుంట్ల వద్ద వెలిగొండ ప్రాజెక్టు కాలువల పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు సయ్యద్ అనీఫ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మోపాడు రిజర్వాయర్‌ను వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చి రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని కోరారు. దీంతో మండలంలోని రైతులకు సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

March 25, 2026 / 08:12 PM IST

‘డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవు’

KDP: డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్‌మెంట్ డీటీ సుధీర్ హోటళ్లు, డాబాల యజమానులకు సూచించారు. బుధవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీలో 80 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వచ్చాయని, వాటిని హోటళ్లు, డాబా యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 25, 2026 / 08:11 PM IST

‘స్థానిక ఎన్నికలు గెలుపే లక్ష్యంగా పని చేయాలి’

VZM: మెరకముడిదాం మండల వైసీపీ నాయకులతో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ క్యాడర్ స్థానిక ఎన్నికలు గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారు. అలాగే, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

March 25, 2026 / 08:11 PM IST

అవయవ దానంపై పోస్టర్ ఆవిష్కరణ

KKD: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జీవన్‌దాన్’ పిలుపు నేపథ్యంలో కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కార్యాలయంలో ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి పాల్గొన్నారు.

March 25, 2026 / 08:11 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

NZB: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో సమీక్ష జరిపారు.

March 25, 2026 / 08:11 PM IST

‘కోతులు, కుక్కల బెడద అరికట్టాలి’

NTR: తిరువూరులోని పలు ప్రాంతాల్లో కోతులు, కుక్కల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా వృద్ధులు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు సంచారం ఎక్కువ అవడం వల్ల రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సోషల్ యాక్టివిస్ట్ రాం ప్రదీప్ బుధవారం ఆర్‌డీవో ఏ.కుమార్‌ని కలసి కోరారు.

March 25, 2026 / 08:10 PM IST