NTR: తిరువూరులోని పలు ప్రాంతాల్లో కోతులు, కుక్కల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా వృద్ధులు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు సంచారం ఎక్కువ అవడం వల్ల రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సోషల్ యాక్టివిస్ట్ రాం ప్రదీప్ బుధవారం ఆర్డీవో ఏ.కుమార్ని కలసి కోరారు.