VZM: మెరకముడిదాం మండల వైసీపీ నాయకులతో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ క్యాడర్ స్థానిక ఎన్నికలు గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారు. అలాగే, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.