ELR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దర్శనానికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఆర్టీసీ విజయవాడ జోన్ 2 ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఏలూరు డిపో నుంచి 20 బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 14 బస్సులు, నూజివీడు నుంచి 6 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.