KNR: శంకరపట్నం మండలంలోని వంకాయగూడెం అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లేశం, ఉపసర్పంచ్ రేణుక ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం, ప్రభుత్వ పథకాల వినియోగంపై వారికి వివరించారు. అంగన్వాడి టీచర్ పద్మ, తల్లులు, పిల్లలు ఉన్నారు.