AP: మావోయిస్టు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏఓబీలో మిగిలి ఉన్న 14 మంది సీనియర్ నేతలలో ఈయనే అత్యంత కీలకమైన వారు. లొంగుబాటు సమయంలో ఆయుధాలతో పాటు కిలో బంగారం, నగదు కూడా అప్పగించినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈయనను ఈనెల 31లోపు పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.