• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో ప్రశాంతంగా భౌతిక శాస్త్రం పరీక్ష

W.G. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో నారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 23,536 మంది విద్యార్థులకు గాను 23,005 మంది హాజరయ్యారు. 531 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఓపెన్ స్కూల్ సాంఘిక శాస్త్రం పరీక్షకు 221 మంది హాజరుకాగా, 41 మంది రాలేదని పేర్కొన్నారు.

March 25, 2026 / 06:34 PM IST

13 కేజీల గంజాయి స్వాధీనం

ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ఎక్స్ప్రెస్ రైలు బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఈగల్ టీం సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే జార్ఖండ్, ఒడిశా, బెంగాల్ కలహండికి చెందిన ఆరుగురు ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

March 25, 2026 / 06:34 PM IST

రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: స్పీకర్

TG: ఇందిరమ్మపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. అయితే  రాకేష్ రెడ్డి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాకేష్ వ్యాఖ్యలను తొలగించాల్సిన అవసరం లేదన్నారు.

March 25, 2026 / 06:32 PM IST

డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

CTR: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల వద్ద డ్రగ్స్, పొగాకు ఇతర నిషేధిత వస్తువులు నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. చిత్తూరు కలెక్టరేట్‌లో బుధవారం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంపై ఎస్పీ తుషార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.

March 25, 2026 / 06:32 PM IST

బూర్గంపాడు కేంద్రంగా కొత్త నియోజకవర్గం..?

BDK: నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసెంబ్లీ స్థానాలు 10 నుంచి 15 కు పెరిగే అవకాశముండటంతో బూర్గంపాడు, భద్రాచలం, పాల్వంచ ప్రాంతాలను కలిపి కొత్త సీటు ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గతంలో నియోజకవర్గంగా ఉన్న బూర్గంపాడును మళ్లీ నియోజకవర్గంగా చేయాలని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

March 25, 2026 / 06:32 PM IST

‘సజావుగా దాన్యం కొనుగోలు చేపట్టాలి’

KKD: రబీ 2025-26 సీజనులో రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా ధాన్యం కనుగోలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు ధాన్య సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

March 25, 2026 / 06:32 PM IST

గురుకుల ప్రవేశ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ

MDK: తూప్రాన్ మండలం నర్సంపల్లి శివారు రెడ్యానాయక్ తండాకు చెందిన నలుగురు విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి ఎంపికైనట్లు HM సుధాకర్ తెలిపారు. పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా నలుగురు ఎంపికైనట్లు వివరించారు. విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఎంఈవో డాక్టర్ సత్యనారాయణ అభినందించారు.

March 25, 2026 / 06:32 PM IST

‘శంకరయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలి’

NLG: తిప్పర్తి (M) ఎర్రగడ్డలగూడెంలో CPM సీనియర్ నాయకుడు గండమండ శంకరయ్య స్తూపం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సభ్యుడు సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. శంకరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దోపిడీ దౌర్జన్యాలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని, ఆ పార్టీకి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు.

March 25, 2026 / 06:32 PM IST

మంత్రిని కలిసిన కొల్కూరి నరసింహారెడ్డి

SRD: రాష్ట్ర బడ్జెట్లో కార్మిక శాఖకు 1000 కోట్లు కేటాయించడం హర్షాన్నిచ్చిందని పటాన్ చెరువు INTUC ట్రేడ్ యూనియన్ నాయకుడు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటస్వామిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

March 25, 2026 / 06:30 PM IST

ఆలయంలో హుండీ లెక్కింపు

NGKL: పదర మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మద్దిమడుగు శ్రీపబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 85 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 19,11,392 ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి, ఆలయ ఈవో నరసింహ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది.

March 25, 2026 / 06:30 PM IST

క్షయ నిర్మూలనలో జగిత్యాలకు ‘స్టేట్ అవార్డు’

JGL: వరల్డ్ TB డే సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన వేడుకల్లో జగిత్యాల జిల్లా సత్తా చాటింది. క్షయ వ్యాధి నిర్మూలనలో విశేష కృషి చేసినందుకు రాష్ట్రస్థాయిలో జిల్లా 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్యాధికారి డా.శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమష్టి కృషితోనే ఈ అవార్డు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.

March 25, 2026 / 06:30 PM IST

‘బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయండి’

GDWL: ధరూర్ మండలం నీలహళ్లి వాగు బ్రిడ్జి నిర్మాణం పడకేసింది. కాంట్రాక్టర్కు చెల్లింపులు నిలిచిపోవడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ అసంపూర్తి కట్టడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఇక్కడ జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 25, 2026 / 06:30 PM IST

‘శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి’

MDK: గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు ప్రభుత్వం ఇస్తున్న శిక్షలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని జెడ్పీ సీఈవో ఎల్లయ్య పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

March 25, 2026 / 06:30 PM IST

నిలువు రాళ్ళను సందర్శించిన విద్యార్థులు

NRPT: కృష్ణా మండలంలోని ముడుమల్ గ్రామంలో ప్రాచీన నిలువు రాళ్ళను ధన్వాడ మండలంలోని మంది పల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వాటి చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. నిలువు రాళ్ల నీడను ఆధారంగా గతంలో సమయాన్ని సూచించే వారిని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నరసింహులుతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు.

March 25, 2026 / 06:30 PM IST

‘అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలి’

ADB: పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాలను త్వరితగతిన ఛేదించడానికి సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఆర్థిక నేరాలు దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలని సూచించారు.

March 25, 2026 / 06:28 PM IST