సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 247 అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.
NRML: ఖానాపూర్ పట్టణంలోని శాంతి నగర్లో కడారి శివ కుమార్, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి రెండేళ్ల కుమారుడు కడారి బన్నీ కొంతకాలంగా తీవ్రమైన మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ ముందుకొచ్చారు.
JN: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 232 దరఖాస్తులు రాగా వాటిని కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఇవాళ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 178 ఫిర్యాదులను స్వీరించారని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
E.G: రాజమండ్రి మీదుగా వచ్చే నెల 5 నుంచి ఆయా తేదీల్లో వేసవి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07425) ప్రత్యేక రైలు 13 ట్రిప్పులుగా నడుసస్తాయన్నారు. జిల్లాలో నిడదవోలు, రాజమండ్రిలో ఆగుతాయన్నారు.
కడప: రెండేళ్లుగా కడపలోని టిడ్కో ఇళ్లకు కనీస వసతులు కల్పించకపోవడం దారుణమని CPI నేత వెంకటశివ విమర్శించారు. సోమవారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితకు వినతిపత్రం ఇచ్చిన ఆయన, పెండింగ్ పనులు పూర్తిచేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కరెంటు, నీరు లేక ఇళ్లు చెదలు పడుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేసి సిటీ బస్సు సౌకర్యంతో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని కోరారు.
KNR: చొప్పదండి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందిని సొంత పనులకు వినియోగిస్తున్నారని బీజేపీ నాయకుడు తాడూరి శివకృష్ణ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సిబ్బందితో పాటు మున్సిపల్ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్నారని, దీంతో పట్టణంలో పారిశుద్ధ్య పనులు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.
VZM: బంగారు కుటుంబాల వారు నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపాలని తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్విని కోరారు. సోమవారం గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పీ-4 కార్యక్రమం ఏడాది పూర్తయిన సందర్భంగా సదస్సు జరిగింది. రాష్ట్రంలో 10% గల బంగారు కుటుంబాల వారు అట్టడుగు కుటుంబాల వారిని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడిషనల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీమతి కృష్ణ దాస్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఏయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయోగశాలలు, హెర్బేరియం, ఏయూ డాక్టర్ వి.ఎస్.కృష్ణ గ్రంధాలయాలను తనిఖీ చేశారు. అనంతరం ఆమెను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడెం, కాచికల్ గ్రామాల్లోని ద్విచక్ర వాహనదారులు ఏప్రిల్ 02 నుంచి హెల్మెట్లు ధరించాలని ఎస్సై చిర్ర రమేష్ బాబు గ్రామస్తులకు సూచించారు. రెండు గ్రామాల్లోని ద్విచక్ర వాహనదారుల ఇళ్లకు ఎస్సై తన సిబ్బందితో కలిసి వెళ్లి హెల్మెట్లు పెట్టుకోని వాహనాలు నడపాలని, హెల్మెట్లు ధరించని వారికి గ్రామాల్లోకి ప్రవేశం లేదన్నారు.
అన్నమయ్య: కోళ్లబైలు పంచాయతీలోని హౌసింగ్ లేఅవుట్లో గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్, ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించగా, పేదల సొంతింటి కల సాకారం కావడం ఆనందంగా ఉందని అధికారులు తెలిపారు. బీసీ, ఎస్సీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు అదనపు సహాయంతో ఇళ్లను పూర్తి చేశారు.
WGL: ప్రజావాణి కార్యక్రమంలో సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్కు వచ్చిన ఓ వృద్ధురాలు క్యూలైన్లో నిలబడి ఇబ్బందిపడుతున్నది గమనించిన కానిస్టేబుల్ వెంటనే స్పందించాడు. ఆమెకు కూర్చోవడానికి కుర్చీ ఏర్పాటు చేసి సహాయం అందించాడు. ఈ చర్యతో అక్కడున్న వారంతా అతని మానవత్వాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
సత్యసాయి: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి కోర్టు సోమవారం రూ.40 వేలు జరిమానా విధించింది. హిందూపురం రూరల్ పోలీసులు ఆదివారం రాత్రి తూముకుంట చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన నలుగురిని నేడు కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ రమాదేవి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.
SDPT: బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గైనకాలజీ, దంత, చర్మ, ఎముకలు, కంటి వైద్య నిపుణులు రోగులకు సేవలందిస్తారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఉచిత చికిత్స, మందులు అందుబాటులో ఉంటాయని వైద్యాధికారి డా. మాధురి తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
NGKL: బల్మూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ శిరీష, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ తారా సింగ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో 220 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.