NRPT: కృష్ణా మండలంలోని ముడుమల్ గ్రామంలో ప్రాచీన నిలువు రాళ్ళను ధన్వాడ మండలంలోని మంది పల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వాటి చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. నిలువు రాళ్ల నీడను ఆధారంగా గతంలో సమయాన్ని సూచించే వారిని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నరసింహులుతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు.