KKD: రబీ 2025-26 సీజనులో రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా ధాన్యం కనుగోలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు ధాన్య సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.