NGKL: పదర మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మద్దిమడుగు శ్రీపబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 85 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 19,11,392 ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి, ఆలయ ఈవో నరసింహ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది.