GDWL: ధరూర్ మండలం నీలహళ్లి వాగు బ్రిడ్జి నిర్మాణం పడకేసింది. కాంట్రాక్టర్కు చెల్లింపులు నిలిచిపోవడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ అసంపూర్తి కట్టడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఇక్కడ జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.