• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యూరియా నిల్వలను పరీశీలించిన డీఏవో

KNR: రామడుగు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులలో ఉన్నటువంటి యూరియా నిల్వలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాసంగి పంటలకు సరిపడా యూరియా ఉందని సూచించారు.

February 24, 2026 / 06:33 PM IST

’43వ డివిజన్లో రీ పోలింగ్ నిర్వహించాలి’

PDPL: రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మంగళవారం కలెక్టరేట్‌లో కలిసి ఫిర్యాదు చేసినట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఎన్నికలలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 43వ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేశారని అన్నారు.

February 24, 2026 / 06:33 PM IST

ఈనెల 26న వాహనాల వేలం

ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 26న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఈ వేలంలో 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు ఇతర వాహనాలు ఉండనున్నాయి. ఆసక్తి గలవారు ప్రభుత్వ నిర్దేశిత ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించారు.

February 24, 2026 / 06:33 PM IST

విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల వాహనాల ఎంపిక శిబిరం

అనంతపురం నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల అర్హత ఎంపిక శిబిరం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి మూడు చక్రాల పెట్రోల్ వాహనం కోసం దరఖాస్తు చేసుకున్న 132 మందిని అధికారులు పరిశీలించారు.

February 24, 2026 / 06:33 PM IST

ఘనంగా నూతన నందీశ్వరాలయ మహోత్సవం

అన్నమయ్య: నందిపల్లె సమీపంలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో వైభవంగా హోమాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైసీపీ రాష్ట్ర ప్రధాన శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఆలయ నిర్మాణంలో ఎన్‌ఆర్‌ఐ మారం శ్రీకాంత్ రెడ్డి భక్తిశ్రద్ధలను ఆయన ప్రశంసించారు. ఈ నెల 25న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని మాజీ సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 06:33 PM IST

మావోయిస్టులకు రివార్డులు అందజేసిన DGP

TG: డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ లొంగిపోయిన విషయం తెలిసిందే. దేవ్‌జీతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె రాజిరెడ్డి లొంగిపోయారు. వారికి డీజీపీ రివార్డు చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచించారు.

February 24, 2026 / 06:32 PM IST

ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీకి సహకరించండి: MP

SRD: నూతన కౌన్సిలర్లు ప్లాస్టిక్ నిషేధం అమలుకు కృషి చేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సూచించారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపాలిటీలో తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

February 24, 2026 / 06:31 PM IST

మోహన్‌బాబు యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

AP: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. మోహన్‌బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని భూమన ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని మంగళం గ్రామంగా గుర్తించారు. భూమన మృతదేహాన్ని రియా ఆసుపత్రికి తరలించారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

February 24, 2026 / 06:31 PM IST

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులపై సమీక్ష

NRML: దిలావర్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దుర్గం శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా వారు అధికారులను ఆదేశించారు.

February 24, 2026 / 06:31 PM IST

ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి: డీఎస్పీ

సత్యసాయి: ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని హిందూపురం డీఎస్పీ మహేష్ వాహనదారులకు సూచించారు. మంగళవారం లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌలసముద్రం టోల్ ప్లాజా రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్‌, ఎస్సై నరేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 06:30 PM IST

ఫర్టిలైజర్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ

MBNR: జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(AO) బోవల్ల వెంకటేవ్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా ఎరువులు ఎలా సరఫరా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులతో నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

February 24, 2026 / 06:30 PM IST

పాఠశాలను తనిఖీ చేసిన జిల్లాసమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి

ప్రకాశం: సీఎస్ పురం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని జిల్లాసమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు తీరును సమీక్షించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి, అన్ని వివరాలను సమయానికి నమోదు చేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 06:30 PM IST

‘వార్షిక పరీక్షల పర్యవేక్షణ కట్టుదిట్టంగా నిర్వహించాలీ’

WGL: ఫిబ్రవరి 25వ తేదీ నుంచి నిర్వహించబోయే ఇంటర్ వార్షిక పరీక్షల పర్యవేక్షణ కట్టుదిట్టంగా నిర్వహించాలని వరంగల్ డీఐఈవో శ్రీధర్ సుమన్ అన్నారు. హనుమకొండలోని ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో పరీక్షా పర్యవేక్షణాధికారుల ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి DIEO పలు సూచనలను చేశారు.

February 24, 2026 / 06:30 PM IST

ఫిరంగిపురంలో ఈవీఎం గోడౌన్ పరిశీలన

GNTR: ఫిరంగిపురం మండలం రేపూడిలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్స్ గోడౌన్ మ గుంటూరు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోడౌన్లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తనిఖీ చేశారు. అనంతరం సీసీటీవీల పనితీరును కూడా పరిశీలించారు.

February 24, 2026 / 06:30 PM IST

‘మహిళా వసతిగృహం ఏర్పాటు చేయాలి’

అనకాపల్లిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా హాస్టల్ ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణి కుమార్ డిమాండ్ చేశారు. హాస్టల్ ఏర్పాటు కోసం వచ్చే నెల 9 నుంచి 14 వరకు అనకాపల్లిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఎలమంచిలిలో గోడపత్రిక ఆవిష్కరించారు. హాస్టల్ ఏర్పాటుకు గతంలో పలు సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని పేర్కొన్నారు.

February 24, 2026 / 06:30 PM IST