KRNL: కమ్మలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ నేత ఈరన్న అనారోగ్యంతో బాధపడుతుండగా, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆయనను ఇవాళ పరామర్శించారు. ఈరన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర బీసీ సాధికారిక సభ్యుడు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ అంజినయ్య, ఆశన్న ఉన్నారు.
E.G: రాజమండ్రిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ఎం.మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇంచార్జ్ బి.పద్మ మంగళవారం మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న న్యాయవాదుల నుంచి సంబంధిత కేసుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కేసులు సత్వర పరిష్కారం కావాలన్నారు.
BPT: జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నేపథ్యంలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు క్షేత్రస్థాయిలో పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు వీలుగా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులను మూసివేయించారు.
MHBD: తొర్రూరు మండలంలోని గోపాలగిరి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కల్పిస్తున్న వసతులను ఇవాళ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకూబ్ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని అన్నారు. కూలీలకు రోజు వేతనం రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
KMM: ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య ఆదేశాల మేరకు నగరంలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాపర్తి నగర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లందు రోడ్డు నుంచి ఆపిల్ సర్కిల్ వరకు జటాయు వాహనాల ద్వారా వ్యర్థాలను తొలగిస్తున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్షమని కమిషనర్ తెలిపారు.
NLG: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సాగులో నైపుణ్యాన్ని పెంచుకోవాలని శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నూతన యాంత్రిక పరికరాలను ఉపయోగించి వ్యవసాయాన్ని సరళీకృతం చేసుకోవాలని సూచించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఎలక్ట్రిక్ ట్రాక్టర్, ఇతర వ్యవసాయ పరికరాలను ప్రారంభించారు.
WGL: నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని అధికారులు వద్ద నుంచి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి ఆసుపత్రి త్వరగా ప్రారంభించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
NDL: డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ సీపీఐ నాయకులు మాజీ ఎమ్మెల్సీ విల్సన్, జిల్లా కార్యదర్శి రంగం నాయుడు కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శ్యాముల్ జవహర్కు వారు వినతిపత్రం అందజేశారు. సీఐ ఇంతియాజ్ మండల సీపీఐ నాయకుడు నారాయణపై అన్యాయంగా దాడి చేశాడని వారు అన్నారు.
NZB: బోధన్లోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ మద్యం తాగి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హాజరు పరిచారు. ఆయనకు ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
JN: స్టేషన్ ఘన్పూర్లో శ్రీ సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య వేడుకలకు హాజరయ్యారు. బంజారా సమాజానికి మార్గదర్శిగా నిలిచిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం త్యాగం, సేవ, సమానత్వానికి ప్రతీక అని, బంజారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేద్దామన్నారు.
BDK:మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఈరోజు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో సమగ్ర రివ్యూ సమావేశం నిర్వహించారు.ఏడు మండలాలకు చెందిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రతి శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యే సమీక్షించారు.ప్రతి శాఖ అధికారి తమ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు.
JN: జిల్లాలో రేపటి నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు 16 సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. రేపటి నుంచి మార్చి 16వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 8,605 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 9550371371 ఏర్పాటు చేశామన్నారు.
VZM: మైనర్ డ్రైవింగ్ చట్టపరమైన చిక్కులు తప్పవని, 18 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం అని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ మంగళవారం తెలిపారు. అటువంటి వ్యక్తులు డ్రైవింగ్ చేయడం వలన ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదాల బారిన పడతారని ఆయన స్పష్టం చేశారు. వాహనాలు నడపడంలో తగినంత అనుభవం ఉండాలన్నారు.
సూపర్-8 భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది.