• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నర్సరీను పరిశీలించిన మండల ప్రత్యేకాధికారి

KMR: డోంగ్లి నర్సరీలో నాటిన మొక్కలను సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారిని రమ్య సూచించారు. డోంగ్లిలోని నర్సరీను సందర్శించి పలు సూచనలు చేశారు. నర్సరీలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మొక్కలు ఎదిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.

February 24, 2026 / 07:00 PM IST

పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చిట్యాలలో రాస్తారోకో

NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పురపాలిక పరిధిలోని శివనేనిగూడెం గ్రామస్థులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రెండు రోజుల క్రితం బైక్ ప్రమాదంలో గాయపడిన మహిళా బాధితురాలికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 24, 2026 / 07:00 PM IST

వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలి: CI

NGKL: వాహన డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని మరికల్ సీఐ భగవంతు రెడ్డి వాహనదారులకు సూచించారు. అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వేగంతో వాహనాలు నడపరాదన్నారు.

February 24, 2026 / 07:00 PM IST

ఏప్రిల్ 7న కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్లు

GNTR: కాకుమాను మండలం కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల ఏర్పాట్లపై మంగళవారం అధికారులు సమీక్షించారు. మార్చి 31న మల్లెపూల పూజ, ఏప్రిల్ 3న కుంకుమ పూజ, 7న తిరునాళ్లు జరగనున్నాయి. సమావేశంలో గ్రామస్తులు రోడ్లు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావించారు. ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే వీటిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

February 24, 2026 / 07:00 PM IST

ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. మహిళ సజీవ దహనం

AP: విజయనగరం జిల్లా హుకుంపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భవానీ అనే వివాహిత సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 06:57 PM IST

‘పరీక్షల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు’

NRPT: జిల్లాలో జరిగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించి, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

February 24, 2026 / 06:54 PM IST

చెరువులో యువకుడి మృతదేహం లభ్యం

MBNR: జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ పర్యవేక్షణలో ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.

February 24, 2026 / 06:52 PM IST

దోమల ఫాగింగ్‌లో భారీ కుంభకోణం

TG: బల్దియా దోమల ఫాగింగ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పంపకాల్లో తేడాలు రావడంతో అవినీతి బాగోతం బయటపడింది. ఫాగింగ్ కోసం కేటాయించిన డీజిల్ వాడకుండా అవినీతికి పాల్పడ్డారు. సిబ్బందికి నెలకు రూ.5 వేలు ఇచ్చి.. మిగిలిన డబ్బులను సూపర్ వైజర్ AE, SE పంచుకున్న వారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. అందుకే డీజిల్‌‌లో మైలాథిన్ కలిపి ఇస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 06:48 PM IST

PAK vs ENG: హెడ్ టు హెడ్ రికార్డు

T20 క్రికెట్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ రెండు జట్లు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 21 సార్లు గెలవగా, పాక్ కేవలం 9 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఇక T20 WCలో.. ఈ రెండు జట్లు 3 సార్లు తలపడగా, అన్ని సార్లు ఇంగ్లండే విజయం సాధించింది. అదేవిధంగా, ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 టీ20 మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లీష్ జట్టే గెలవడం గమనార్హం.

February 24, 2026 / 06:48 PM IST

ఇస్కాన్ మందిరం ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

JGL: ధర్మపురిలో ఇస్కాన్ ప్రతినిధుల బృందం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసింది. నరహరి ప్రభు ఆధ్వర్యంలో వచ్చిన బృందం ధర్మపురిలో ఇస్కాన్ మందిరం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసింది. కృష్ణ భక్తి ప్రచారం, భగవద్గీత శిక్షణ, నిత్య అన్నదానం, గోశాల నిర్వహణ ప్రధాన లక్ష్యాలుగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రేమానంద్, సురనాథ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 06:47 PM IST

BREAKING: ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ టీవీ నటుడు మయాంక్ పవార్ (37) కన్నుమూశాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు ఈరోజు తుదిశ్వాస విడిచాడు. సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, మయాంక్ ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచాడు.

February 24, 2026 / 06:47 PM IST

యువతకు నైపుణ్య నిధి ‘స్టార్టప్ కడప’: కలెక్టర్

కడప: ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్మిస్తున్న ‘స్టార్టప్ కడప’ సెంటర్ పనులను మంగళవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సెంటర్ యువత నైపుణ్యాల వృద్ధికి, ఉపాధికి, నూతన వ్యాపార అవకాశాలకు గొప్ప వేదికగా మారుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

February 24, 2026 / 06:47 PM IST

రెండు నెలల బాలుడి హత్య.. బిగ్ ట్విస్ట్

TG: దుండిగల్ రెండు నెలల బాలుడి హత్యకేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి నుంచి ఏడుస్తున్నాడని కుమారుడిని చంపినట్లు ఆ తల్లి చెప్పడంతో అంతా షాకయ్యారు. చిన్నారిని చంపడంపై భర్త ప్రశ్నించడంతో అతడితో గొడవ పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

February 24, 2026 / 06:45 PM IST

పటాన్ చెరువు ప్రాంతంలో ఇంటింటి సర్వే

SRD: రామచంద్రపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డిప్యూటీ ఆరోగ్య అధికారి ఏఎస్‌డీ కమల కుమారి బృందం ఆధ్వర్యంలో లేక్ వ్యూ రెసిడెన్షియల్ కాలనీలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 30 సంవత్సరాల పైబడిన వారి ఆరోగ్య వివరాలను సేకరించినట్లు కమల కుమారి తెలిపారు. ఈ సందర్భంగా గుండం మోహన్ రెడ్డిని కలిసి ఆరోగ్య సంబంధిత వివరాలు తీసుకున్నారు.

February 24, 2026 / 06:45 PM IST

అకాల వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న

KMR: తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, జొన్న నేలకొరిగింది. దీంతో రైతులు పంట నష్టం జరిగిందని మంగళవారం వాపోయారు. పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు సర్వే చేసి తమను ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన పంటకు పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

February 24, 2026 / 06:44 PM IST