ASF: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వాంకిడి MPDO కార్యాలయంలో శనివారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. MPDO పాటిల్ జ్యోత్స్న ఆధ్వర్యంలో కార్యాలయంలో పేరుకుపోయిన పనికిరాని పాత ఫైళ్లు, రికార్డులను గుర్తించి శుభ్రపరచి క్రమబద్ధీకరించారు. ముఖ్యమైన పత్రాలను, కార్యాలయంలో అవసరమైన సామగ్రిని సక్రమంగా ఏర్పాటు చేశారు.
NLG: పీఏ పల్లి మండలంలో విపరీతమైన విద్యుత్ కోతలపై ఆగ్రహించిన చిలకమర్రి, సూరేపల్లి, రోళకల్ గ్రామాల రైతులు అంగడిపేట స్టేజ్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏఈ కార్యాలయానికి తాళం వేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు నష్టం జరుగుతోందని, తక్షణమే నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
NLG: పీఏపల్లి మండలంలో విపరీతమైన విద్యుత్ కోతలపై ఆగ్రహించిన చిలకమర్రి, సూరేపల్లి, రోళకల్ గ్రామాల రైతులు అంగడిపేట స్టేజ్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏఈ కార్యాలయానికి తాళం వేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు నష్టం జరుగుతోందని, తక్షణమే నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
KMM: ఖమ్మం రూరల్ పరిధిలో నగదు లావాదేవీల కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. కొండాపురానికి చెందిన ఎం.నాగేశ్వరరావు 2017లో జనార్దన్ రావు వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకుని ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. బాధితుడు కోర్టును ఆశ్రయించగా, విచారణలో నేరం రుజువు అయ్యింది. దీంతో ఎం. నాగేశ్వరరావుకు జడ్జి కాసర గడ్డ దీప ఆరునెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చారు.
TG: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. ఈ మూడు రోజుల పాటు 12PM నుంచి 3pm వరకు అత్యవసరం అయితే తప్ప, బయటకు రావద్దని తెలిపింది. దాహం వేయకపోయినా ప్రజలు తరచూ నీళ్లు తాగాలని స్పష్టం చేసింది.
RR: షాద్నగర్ మున్సిపాలిటీ 9వ వార్డులో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టారు. విజయనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం వెనుక పరిసరాలను పారిశుద్ధ్య కార్మికులతో పాటు కౌన్సిలర్ అశోక్ పాల్గొని శుభ్రం చేశారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
TPT: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు (మార్చి 8) ఉదయం 9.30 గంటలకు చంద్రగిరి పట్టణంలోని MSR కళ్యాణ మండపంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.
VSP: రుషికొండ బీచ్ రోడ్డులో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమ వాణిజ్య నిర్మాణాలు జరుగుతున్నాయని మత్స్యకార సంఘ ప్రతినిధి తెడ్డు శంకర్ ఆరోపించారు. అనుమతులు లేకుండా హోటల్ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై మధురవాడ జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదన్నారు. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
NDL: శ్రీశైలం దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి కర్నూలుకు చెందిన భక్తుడు నాగ సుబ్బారెడ్డి శుక్రవారం రూ.1,00,116 విరాళం అందజేశారు. దేవస్థానం డొనేషన్ కౌంటర్ వద్ద ఆలయ అధికారులకు ఈ మొత్తాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వామి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు.
WGL: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య విభాగంలో మహిళా కార్మికుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం 66 డివిజన్లలో మొత్తం 4,647 మంది కార్మికులుండగా, వారిలో సగం మహిళా కార్మికులు ఉన్నారు. గతంలో మహిళలే అధికంగా ఈ పనులు చేసేవారు. అయితే, అనారోగ్యం కారణంగా మహిళ కార్మికుల సంఖ్య తగ్గడంతో.. గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుద్ధ్యం అటకెక్కుతోంది.
MNCL: మంచిర్యాలకు చెందిన మామిడి గంగరాజు అనే వ్యక్తి వద్ద తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చే క్రమంలో చెల్లని చెక్కు ఇచ్చిన దుర్ముట్ల అంజయ్య అనే వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ మంచిర్యాల రెండో అదనపు న్యాయమూర్తి కె. నిరోష తీర్పునిచ్చారు. తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించాలన్నారు. బాధితుడు న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయించగా కోర్టులో నేరం రుజువు అయింది.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీనివాస మంగాపురం’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా, రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మూడో షెడ్యూల్ తాజాగా పూర్తి కావడంతో 60% చిత్రీకరణ పూర్తయింది. మోహన్ బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
SDPT: సిద్దిపేట పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో వెలిసిన దుర్గ భవాని అమ్మవారికి మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు వారాలుగా కొనసాగుతున్న కార్యక్రమంలో భాగంగా అమ్మవారి సన్నిధిలో లలిత సహస్రనామ పారాయణం చేశారు. పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. పూజల అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
NLR: గూడూరులో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 100 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్వో లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కలువాయి(M) నుంచి బియ్యాన్ని అక్రమ మార్గాల్లో గూడూరుకు తరలించారన్నారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనను స్థానికులే గుర్తించి తమకు సమాచారం ఇచ్చారన్నారు.
KDP: సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గంగిరెడ్డిపల్లి ఎస్సై కృష్ణయ్య సూచించారు. మండల పరిధిలోని అనిమెల గ్రామంలో శుక్రవారం ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సైబర్ నేరాలకు గురికావాల్సి ఉందన్నారు. ఓటీపీలు ఎవరికి చెప్పరాదన్నారు. అనంతరం మహిళల భద్రతపై పలు సూచనలు చేశారు.