NLG: పీఏ పల్లి మండలంలో విపరీతమైన విద్యుత్ కోతలపై ఆగ్రహించిన చిలకమర్రి, సూరేపల్లి, రోళకల్ గ్రామాల రైతులు అంగడిపేట స్టేజ్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏఈ కార్యాలయానికి తాళం వేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు నష్టం జరుగుతోందని, తక్షణమే నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.