TG: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. ఈ మూడు రోజుల పాటు 12PM నుంచి 3pm వరకు అత్యవసరం అయితే తప్ప, బయటకు రావద్దని తెలిపింది. దాహం వేయకపోయినా ప్రజలు తరచూ నీళ్లు తాగాలని స్పష్టం చేసింది.