ASF: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వాంకిడి MPDO కార్యాలయంలో శనివారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. MPDO పాటిల్ జ్యోత్స్న ఆధ్వర్యంలో కార్యాలయంలో పేరుకుపోయిన పనికిరాని పాత ఫైళ్లు, రికార్డులను గుర్తించి శుభ్రపరచి క్రమబద్ధీకరించారు. ముఖ్యమైన పత్రాలను, కార్యాలయంలో అవసరమైన సామగ్రిని సక్రమంగా ఏర్పాటు చేశారు.