MBNR: జడ్చర్లకు చెందిన ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి మహిళల స్వయం ఉపాధికి కృషి చేస్తున్నారు. 2021లో సంస్థను స్థాపించి సుమారు 1000 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. కరోనా సమయంలో మాస్కులు తయారు చేసి పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ బట్ట సంచులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ADB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్ కలిసి రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కిట్లను ఆవిష్కరించి వైద్య సిబ్బందికి అందజేశారు. IOCL, సన్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అనూష, మహిళా వైద్యులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు.
VKB: శ్రీ పాంబండ శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. కుల్కచర్లలోని బండవెల్కిచర్లలో ఏకశిలా పర్వతంపై వెలసిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు నేటి నుంచి ఉగాది పర్వదినం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని దేవాలయం ఈవో బాల నరసయ్య, ఛైర్మన్ మహిపాల్ రెడ్డి తెలిపారు. దైవదర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని మహిళలందరికీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ సునీత-రవీందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు సత్తా చాటుతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు.
MNCL: మహిళలు అభివృద్ధి పథంలో పయనించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులను, అధికారులను ఆయన ఘనంగా సన్మానించారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SRCL: వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలను వీక్షించి విజేతలను అభినందించారు. ఈ మేరకు మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.
CTR: బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్ నిండిపోయి రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనం అనంతరం ఉచిత తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
NDL: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. కల్లూరు మండలం నాయకల్లులో రైతులకు ఇవాళ నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పల్నాడు: దుర్గి మండలం అడిగొప్పుల శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. నిదానంపాటి అమ్మవారి కృపతో పల్నాడు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తిరునాళ్ల నిర్వహణలో కృషి చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.
TG: వరంగల్ భూగర్భ డ్రైనేజీకి రూ.5,257 కోట్ల నిధులు మంజూరు చేయడంపై MLA నాయిని రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. గతంలో BRS తమ ప్రాంతాన్ని నాశనం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన వచ్చాక వరంగల్లో భూకబ్జాలు లేవని, విమానాశ్రయ భూసేకరణకు రూ.300 కోట్లు కేటాయించారని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
NRPT: మక్తల్ పట్టణంలో నిర్మిస్తున్న 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం పరిశీలించారు. నిర్మాణ పురోగతిపై కాంట్రాక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ లోపు నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, నేతలు పాల్గొన్నారు.
SRPT: సృష్టికి మూలమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వార్డు కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తిని కొనియాడారు. కార్యక్రమంలో టీచర్ శారద, నాగమణి తదితరులు ఉన్నారు.
KNRL: కోసిగి మండల MPP పెండేకంటి లవకుశ ఈరన్న భార్య, మాజీ వైస్ యంపీపీ పెండేకంటి నాగరత్నమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఇవాళ కోసిగి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరన్న కుటుంబాన్ని ఓదార్చి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
TPT: సత్యవేడు మండలం ఇరుగుళం గ్రామంలో క్రొత్తగా నిర్మించబడిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు, సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ ద్వారా సమాజంలో సామ్య, సమానత్వ భావాలను పెంపొందించడమే లక్ష్యం అని వారు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థ ప్రతినిధి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.