తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ సై అంటే సై అంటుండగా.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) కూడా కసరత్తు ప్రారంభించింది. ముగ్గురు సీనియర్ అధికారుల బృందం ‘తెలంగాణ ఎన్నికల’పై సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు
అంబానీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరారు. అనంత్ అంబానీతో రాధికకు నిశ్చితార్థం ఎప్పుడో జరిగింది. వీరిది ప్రేమ వివాహం అనే విషయం మీకు తెలుసా? మరి వీరి ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం.
ఇద్దరు కూతుళ్లను తల్లితండ్రులే(parents) హత్య(murder) చేసిన ఓ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే వారిని హత్య చేయడాన్ని పలువురు సపోర్ట్ చేస్తుండగా..మరికొంత మంది మాత్రం తప్పని చెబుతున్నారు. అసలు వారి కుమార్తెలు ఏం చేశారు? ఎందుకు వారిని పేరెంట్స్ చంపేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పంచాయతీ కార్యదర్శులు ప్రొబేషన్ పీరియడ్ ఈ నెల 11తో ముగిసిందని, గడువు ముగిసిన పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని వారు అన్నారు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని చివరి వరకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా సమర్పించారు.
దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో పాటు మొత్తం 16 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన నలుగురు భారతీయులు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు.
సూర్య(Suriya) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే సూర్య 42వ చిత్రానికి టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో కంగువా(Kanguva) టైటిల్ లుక్తోపాటు ఓ వీడియోను కూడా మేకర్స్ షేర్ చేశారు.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీస్ డ్యాన్సింగ్ టాలెంట్ జనాల్సి ఆకట్టుకుంటోంది. ముంబయికి (mumbai) చెందిన అమోల్ కాంబ్లీ (amolkamble) తన డ్యాన్స్ అదరగొడుతున్నారు. అంతకు ముందు ఆయన రణ్వీర్సింగ్ (Ranveer Singh)పక్కన వేసిన స్టెప్పులు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా వర్కవుట్ చేస్తూ వేసిన స్టెప్పుల్ని రాఘవ్ అనే ఇన్స్టా (Insta) యూజర్ షేర్ చేయడంతో మరోసారి వైరల్ అయ్యారు
ఏపీలోని పల్నాడు(palnadu) పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్లో విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో 8వ తరగతి విద్యార్థి కోటిస్వాములు మృతి చెందాడు. రాత్రి భోజనం(Supper) చేశాక ఊపిరాడటం లేదని విద్యార్థి కోటిస్వాములు ఫ్రెండ్స్(Friends)కి చెప్పాడు. దీంతో హాస్టల్ వార్డెన్(Hostel warden) కోటిస్వాములను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కోటిస్వాములు చనిపోయాడు.
ఎట్టకేలకే క్రిష్ మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే వచ్చిన మూడు క్రిష్ సిరీస్ లు మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ క్రిష్-4(Krrish 4) గురించి 2014 నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్ర నిర్మాత, డైరెక్టర్ రాకేషన్ రోషన్(rakesh roshan) ఈ చిత్రం గురించి సరికొత్త అప్ డేట్ ఇచ్చారు.
ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శుక్రవారం ప్రియురాలి పుట్టిన రోజును (birthday) ఘనంగా చేశాడు, ఆపై కేకు కోసిన కత్తితోనే ఆమె గొంతుకోశాడు. ఆపై నేరుగా పోలీస్ స్టేషన్ (Police station) కు వెళ్లి లొంగిపోయాడు. వాట్సాప్ లో చాట్ చేస్తుండడం చూసి ఎవరితో చాట్ చేస్తున్నావని అడిగితే చెప్పకపోవడం, చాటింగ్ చూపించేందుకు నిరాకరించడంతో కోపం పట్టలేక చంపేసినట్లు...
సౌరభ్ గంగూలీ (Saurabh Ganguly), విరాట్ కోహ్లిల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. శనివారం బెంగళూరు (Bangalore)-దిల్లీ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు.
అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ల హత్యతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేగింది. అల్లర్లు ఏర్పడే ప్రమాదం ఉన్నట్టు భావించిన అధికారులు అన్ని జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. సున్నితమైన ప్రాంతాలకు పెట్రోలింగ్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం నివాసానికి భద్రత పెంచారు.
సూడాన్లో ఆర్మీ, పారా మిలటరీ బలగాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ ఇళ్లకే పరిమిత మయ్యారు. శనివారం (Saturday)సూడాన్ రాజధానిలో సైనిక, బలగాల పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిపోయింది.