పల్నాడు: దుర్గి మండలం అడిగొప్పుల శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. నిదానంపాటి అమ్మవారి కృపతో పల్నాడు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తిరునాళ్ల నిర్వహణలో కృషి చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.