CTR: బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్ నిండిపోయి రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనం అనంతరం ఉచిత తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.