CTR: గంగవరం మండలంలోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. వ్యవస్థాపకులు తులసీనాథం నాయుడు దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 20 మంది పారిశుద్ధ్య కార్మికులను ఈ సందర్భంగా సన్మానించారు. వారికి దుస్తులను పంపిణీ చేశారు. సృష్టిలో మహిళ గొప్పదనాకి మరేది సాటి లేదని వారు తెలియజేశారు.