తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎన్నడూ లేని విధంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నంద్యాలలో 41.59 డిగ్రీలు, పార్వతీపురం మన్యంలో 41, తిరుపతిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ క్రమంలో 12 రాష్ట్రాలకు IMD హీట్వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.
ATP: రాయదుర్గం పట్టణంలోని స్థానిక వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, మున్సిపల్ ఛైర్ పర్సన్ పోరాళ్ల శిల్ప పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే కాల్వ పేర్కొన్నారు.
BDK: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మహిళా సోదరీమణులకు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి వంటి ఎందరో మహిళలు తమ హక్కుల కోసం అసువులు బాసారని పేర్కొన్నారు.
NLG: పెంచిన వంటలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు డేవిడ్ కుమార్ అన్నారు. ఆదివారం నకిరేకల్ లో పెంచిన ధరలను నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్తో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై పెనుభారం మోపుతుందని మండిపడ్డారు.
SDPT: రామక్కపేటలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ వేడుకలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
NGKL: కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పట్టణంలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం ఆయన పర్యటించారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
NRPT: కోస్గి మున్సిపాలిటీలో 99 రోజుల ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ వేగంగా సాగుతోంది. ఆదివారం 10వ వార్డులో మున్సిపల్ ఛైర్మన్ నాగులపల్లి నరేందర్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. పార్కుల వద్ద పేరుకుపోయిన చెత్తను, మురికిని స్వయంగా సిబ్బందితో కలిసి తొలగించారు. పట్టణ పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
MNCL: 14 ఏళ్లు నిండిన బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో ఆదివారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక నివారణ మందు అన్నారు.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కొమిల్లా ప్రాంతంలో శనివారం పూజ చేసుకుంటున్న హిందువుల బృందంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
సత్యసాయి: హిందూపురం ఏఎంఎస్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సృష్టికి మూలం స్త్రీ అని పేర్కొన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు స్త్రీలకు ఎంతో ప్రత్యేక స్థానం ఇచ్చాయని తెలిపారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని కొనియాడారు.
BHNG: కృష్ణా నీళ్లు సప్లై చేసే మెయిన్ పైపు పగిలి వారం రోజులు అవుతున్నా గ్రామపంచాయతీ సిబ్బంది పాలకవర్గం పట్టించుకోవడం లేదంటూ గ్రామపంచాయతీ ముందు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల ప్రతాప్ ఆదివారం ధర్నా చేశాడు. నారాయణపురం మండలం, లింగవారిగూడెం గ్రామానికి వారం రోజులు అవుతున్నా పట్టించుకోకపోవడం వల్ల గ్రామంలోని ప్రజలకు తాగునీరు అందడం లేదన్నారు.
E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆదివారం ఎస్. రామలక్ష్మి (73) మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ప్రస్తుతం మరో 9 మంది వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితుడు గణేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
NLR: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్, ఆటల పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఆదివారం డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఆయన మహిళలు అన్ని రంగాల్లో రాణాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పులి శివ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
ASR: డుంబ్రిగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై ఎల్.సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మహిళా వార్డెన్, మహిళా ఉపాధ్యాయురాళ్లను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని వెళ్తున్నారన్నారు. మహిళలను అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు.
SRD: న్యాల్కల్ మండలం ముంగి గ్రామానికి చెందిన S. శ్రీనివాస్ రెడ్డికి (CMRF) ద్వారా మంజూరైన రూ.1,75,000 LOC పత్రాన్ని ఆదివారం హైదరాబాద్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు నాణ్యమైన ఆస్పత్రి వైద్యం అందేందుకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వం CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.