సత్యసాయి: హిందూపురం ఏఎంఎస్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సృష్టికి మూలం స్త్రీ అని పేర్కొన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు స్త్రీలకు ఎంతో ప్రత్యేక స్థానం ఇచ్చాయని తెలిపారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని కొనియాడారు.