తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎన్నడూ లేని విధంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నంద్యాలలో 41.59 డిగ్రీలు, పార్వతీపురం మన్యంలో 41, తిరుపతిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ క్రమంలో 12 రాష్ట్రాలకు IMD హీట్వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.