MNCL: 14 ఏళ్లు నిండిన బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో ఆదివారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక నివారణ మందు అన్నారు.