SDPT: రామక్కపేటలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ వేడుకలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.