AP: ప్రవచనకర్త గరికపాటి నరసిహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. ‘డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు. అంగారక గ్రహంలో మస్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ట్రంప్ ఆధిపత్యం కోసం కనిపించే దేశంపై దండయాత్ర చేస్తున్నాడు. వాళ్లను నాశనం చేయడానికి శ్రీమహా విష్ణువు రావాల్సిందే’ అని పేర్కొన్నారు.