TG: వరంగల్ జిల్లా కోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. . అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాల నుంచి జడ్జీలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించి బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. కాగా గత కొన్ని రోజులుగా పలు చోట్ల బాంబులు పెట్టినట్లు వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి.