AP: చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉచిత విద్యుత్ పథకంతో ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640.. మరమగ్గం నేతన్నలకు రూ.21,600 వరకు ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. చేనేతలకు గౌరవప్రదమైన జీవనమే తమ కూటమి ప్రభుత్వం లక్ష్యమని సవిత చెప్పారు.