AP: అసెంబ్లీ ఆమోందించిన 7 బిల్లులను ఇవాళ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పురపాలక శాఖకు సంబంధించి 2 చట్టసవరణ బిల్లులు, దేవదాయ శాఖకు సంబంధించి 2, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల చట్టసవరణ బిల్లులు, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన బిల్లులను మండలి ముందుకు తీసుకురానుంది. ఈ క్రమంలో శాంతిభద్రతలపై మండలిలో లఘు చర్చ జరగనుంది.