TG: హైకోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి.. అది ఫేక్ మెయిల్ అని స్పష్టం చేశారు. కోర్టు పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని తెలిపారు. అయితే ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.